English | Telugu

ఏపీలో 5 వేలు దాటిన కరోనా కేసులు... తాజాగా రెండు మరణాలు

ఏపీలో గత 24 గంటల్లో 15,173 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తం 5087 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్నూల్, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 86కి చేరింది. గత 24 గంటల్లో 47 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో, ఇప్పటిదాకా మొత్తం 2,770 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 2,231 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.