English | Telugu
తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు.. మళ్లీ లాక్డౌన్!!
Updated : Jun 29, 2020
తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. దీంతో, గ్రేటర్ పరిధిలో మళ్లీ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారు. హైదరాబాద్లో 15 రోజులపాటు లాక్డౌన్ విధించాలని వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని సీఎం చెప్పారు. కరోనా నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేస్తామని, అలాగే హైదరాబాద్లో కొద్దిరోజులు తిరిగి లాక్డౌన్ విధించాలనే ప్రతిపాదనలపైనా తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం సర్కార్ మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది.