English | Telugu
చంద్రబాబును ప్రశాంతంగా ఇంట్లో ఉండనివ్వని వైసిపి.. కేసులు నోటీసులతో రచ్చ
Updated : Sep 2, 2020
ఇది ఇలా ఉండగా అధికారంలో ఉన్న వైసిపి మాత్రం అటు టీడీపీని ఇటు బాబును నిత్యం విమర్శిస్తూ ప్రజల లో ఆ పార్టీ పట్ల సానుభూతి పెరిగేలా తమవంతు కృషి చేస్తున్నారు. అయితే వైసిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ పై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించి ఆ పార్టీని జనంలో ఎండగట్టే ప్రయత్నం చేయకుండా నిత్యం ఏదో ఒక సాకుతో బాబును విమర్శిస్తూ మరోపక్క ఇటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏదో ఒక సాకుతో అరెస్టులు చేయడంతో టీడీపీకి ప్రజలలో మరింత సానుభూతి పెరుగుతోంది. తాజాగా చిత్తూరులో ఓం ప్రతాప్ అనే దళిత యువకుడి ఆత్మహత్య పై టీడీపీ అధినేత చంద్రబాబు డిజిపికి లేఖ రాసారు. సోషల్ మీడియాలో అతడు చేసిన కామెంట్లపై కొంత మంది వైసిపి నేతలు, పోలీసులు బెదిరింపులకు పాల్పడడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు చేసారు. దీని పై వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు బాబు స్వయంగా చితూర్ జిల్లా లోని పోలీస్ స్టేషన్ కు వచ్చి తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు. ఇప్పటికైనా వైసిపి మేల్కొని బాబుగారికి మైలేజి ఇచ్చే ఇటువంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిదని.. లేదంటే తనకు తానే ప్రత్యర్థికి అస్త్రాలు ఇచ్చి మరీ ఆ పార్టీని బలోపేతం చేసి ఇటువంటి కార్యక్రమాలతో వచ్చే ఎన్నికలలో వైసిపికి గడ్డు పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.