English | Telugu

భారత్ చైనాల మధ్య అర్థరాత్రి కాల్పుల కలకలం..

భారత్, చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతలు తగ్గకముందే ఇంకోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎల్‌ఏసి వద్ద చైనా సైన్యం రెచ్చగొట్టేలా వ్యవహరించందని నిన్న లడఖ్‌లోని పాంగ్యాంగ్ సరస్సు ఒడ్డున వాస్తవ నియంత్రణ రేఖను దాటి వచ్చే ప్రయత్నంలో భారత సైనికులు కాల్పులు జరిపారంటూ చైనా ఆరోపించింది. దీనిని తిప్పికొట్టేందుకు చైనా కూడా ఎదురుదాడి చేయవలసి వచ్చిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్ మొట్ట మొదటిగా కాల్పులు జరిపిందని.. ఇండియన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ దాటి షెన్పావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిందని చైనా సైనిక ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై భారత వైపు నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.