English | Telugu
ప్రముఖ వైద్యులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
Updated : Jul 25, 2020
గత రెండు వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉందన్నారు. మారణాల్లోనూ రెండవ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని అప్రమత్తం చేయటం తప్ప.. ప్రస్తుతానికి మందులు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. అంబులెన్స్ లు, ఆస్పత్రుల్లో శానిటైజేషన్ ఎంతో ముఖ్యమని అన్నారు. ఎక్కువ మంది రోగులను ఒకే అంబులెన్స్లో తీసుకురావటమూ వ్యాధి వ్యాప్తికి మరింత కారణం అవుతోందని తెలిపారు. క్వారంటైన్ కేంద్రాల్లో తగు వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని పేర్కొన్నారు. కరోనా మృతులకు సరైన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమన్నారు. ప్రజలకు వేరే ఏ అత్యవసర చికిత్స అవసరం అయినా, కరోనా పరీక్ష చేసి ఫలితాలు వచ్చేవరకు వైద్యం అందించడంలేదని చంద్రబాబు ఆరోపించారు.