English | Telugu

డీజీపీ సూచనను ఫాలో అవ్వండి.. టీడీపీ కేడర్ కు బాబు అదిరిపోయే ఐడియా.. 

ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలిచాలని సీఎం జగన్ ప్రకటించడంతో అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై ఈరోజుకు ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సంఘం ఈరోజు రాయపూడిలో "జనభేరి" పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. దీనికి పలు ప్రతిపక్షాల నేతలు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశానికి రావడానికి సిద్దమైన టీడీపీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ కేడర్ కు అదిరిపోయే సూపర్ ఐడియా ఇచ్చారు. పోలీసులు ఒక కేసు పెడితే మీరు రెండు ప్రయివేట్ కేసులు పెట్టండి. ఒకవేళ పోలీసులు కేసులు తీసుకోకపొతే టెక్నాలజీ వాడుకోవాలని.. డిజిపి గౌతమ్ సవాంగ్ గతంలో చేసిన సూచనను ఫాలో అవ్వాలని వారికి సూచించారు. పోలీసులు కనుక నేరుగా ఫిర్యాదులు తీసుకోకపోతే ఆన్ లైన్ లో కేసులు రిజిష్టర్ చేయాలని చంద్రబాబు తన పార్టీ నాయకులాలకు,కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రస్తుత పరిష్టితులలో పోలీసులు కాళ్లబేరానికి రావాలంటే ప్రైవేట్ కేసులు ఒక్కటే మార్గమని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. తప్పుడు కేసులకు కాలం చెల్లిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని డిజీపీ పదేపదే ఊదరగొడుతున్నారని మనం కూడా అయన సలహాను ఫాలో అవుదామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.