English | Telugu
అమరావతి విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం
Updated : Aug 1, 2020
అయితే దీంతో రాజధాని తరలింపు ఆగిపోతుందా అంటే.. ముందుగా టీడీపీ చేసే ఈ ప్రయత్నంతో దేశం మొత్తం దృష్టి ఇటు పడే అవకాశం ఉంటుంది అందులో టీడీపీకి జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల ఆధారంగా దేశవ్యాప్త అంశంగా చేసి కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. అదే విధంగా ఇటు రాష్ట్రంలో కూడా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళనలకు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఉద్యమానికి కృష్ణా, గుంటూరు ప్రజలు పూర్తిగా మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల నుంచి మాత్రం అంతగా దీనికి మద్దతు లభించక పోవచ్చు. ఇప్పటికే గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యూహం ఏ విధంగా విజయవంతం అవుతుందో వేచి చూడాలి.