English | Telugu

చంద్రబాబు కథ ఇక ముగిసినట్లే: బొత్స

ఏపీ అసెంబ్లీ లో ఈ రోజు రాజ్యసభ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ సందర్బంగా మంత్రి బొత్స టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసారు. చంద్రబాబు రాజకీయ పుస్తకం పేజీ చిరిగిపోయిందని, ఆయన రాజకీయ జీవితంలో ఇక కొత్త పేజీలు లేవని బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ ప్రసంగం వినటం ఇష్టం లేని బాబు.. మళ్ళీ అదే గవర్నరును ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలలో తగినంత బలం లేదని తెలిసినా టిడిపి అభ్యర్దిని నిలపటం నీచమని మంత్రి బొత్స బాబు పై మండిపడ్డారు. గతంలో సంఖ్యాబలం ఉన్నప్పుడు దళితులు గుర్తుకు రాలేదని, ఐతే సంఖ్యాబలం లేనప్పుడు మాత్రమే గుర్తుకొచ్చినట్లున్నారని అన్నారు. చంద్రబాబు అంత మోసగాడు రాజకీయాలలో ఎవరూ లేరని...ఆయన జీవితం అంతా కుట్రల మయమేనని బొత్స విరుచుకుపడ్డారు.