English | Telugu
కేసీఆర్ ఖేల్ ఖతం అంటున్న బీజేపీ.. ఇది సీరియస్ గానేనా..!
Updated : Jul 2, 2020
నిన్న బీజేపీ నిర్వహించిన జనసంవాద్ వర్చ్యువల్ ర్యాలీలో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా రాం మాధవ్ చేసిన ఒకే ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకూ అయన ఏదో ఫ్లోలో ఆలా అన్నారా లేక ముందస్తుగా ఏమైనా హింట్ ఇస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇప్పటికే కరోనా తో సహా వివిధ అంశాల పైన టిఆర్ఎస్ బీజేపీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకూ రామ్ మాధవ్ ఏమన్నారంటే "ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి ఫ్రంటు లేదు టెంటు లేదు చివరికి హైదరాబాద్ లో ఒంటరిగా ఏకాకిగా కూర్చున్నారు. అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడుతూ ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని" తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంటే కాకుండా "సగం సగం పూర్తైన కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప ఏడాది కాలంలో మీరు సాధించిన ప్రాజెక్ట్ ఒక్కటైనా ఉందా.. అసలు మీ ఏడాది పాలనా పై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే ధైర్యముందా " అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. "అవినీతి, అసమర్ధతకు మారుపేరుగా తెలంగాణ ప్రభుత్వం తయారైందని, చివరికి కరోనా పై పోరాటంలో కూడా ఫెయిల్ అయిందని అన్నారు. కరోనా కేసులపై మసిపూసి మారేడు కాయ చేసి కేంద్ర బృందాలను మోసం చేయగలరేమోగాని కరోనా బారిన పడ్డ రాష్ట్ర ప్రజలను ఎంత కాలం మోసం చేయగలరు" అని అయన కేసీఆర్ పై మండి పడ్డారు. కేంద్రం కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా తెలంగాణ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోకపోవడంతో కేసులు పెరిగాయన్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న తెలంగాణాలో రోజుకు కేవలం రెండు వేల పరీక్షలు చేస్తున్నా 15 వేలు పాజిటివ్ కేసులు తెలియని అన్నారు.