English | Telugu
ఆ మాంసం తిన్నందుకే మనిషికి కరోనా!
Updated : Mar 28, 2020
పంది, కుక్క, పిల్లి, పాము, గుర్రం, గాడిద, గబ్బిలం, అలుగు మాంసంలో కరోనావైరస్ ఉంటుందట. వీటి మాంసం తినడం ద్వారా వాటిలో వున్న వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సెంటర్ తమ అధ్యయనంలో వెల్లడించింది.
చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పంది, కుక్క, పిల్లి, పాము, గుర్రం, గాడిద, గబ్బిలం, అలుగు మాంసం ఆహారంగా తింటుంటారు. అక్కడి మార్కెట్లలో ఇలాంటి మాంసానికి డిమాండ్ ఎక్కువట. గబ్బిలాల్లో ఉండే Corona Virus జీన్స్ కాంబినేషన్తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని మరికొంత మంది సైంటిస్టులు చెబుతున్నారు. విషపూరిత పాములు China Snakes తమ ఆహారంగా అడవుల్లో Bats గబ్బిలాలను వేటాడి తిని జీవిస్తుంటాయి. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్.. పాములు వాటిని తినడం ద్వారా సంక్రమించి.. ఆ పాముల మాంసాన్ని తిన్న మనుషుల్లోకి కూడా వైరస్ పాకిందని మరికొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ఇప్పుడు ఈ డెడ్లీ కరోనా వైరస్.. గాలి ద్వారా కూడా వ్యాపిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎటాక్ చేస్తుందోనన్న భయమే అందరిని బెంబేలిత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తూ ప్రపంచమంతా పాకింది.