English | Telugu

మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారు:  ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని, మిగిలిన వారు మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు...ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ ఫత్వా కూడా జారీ చేసింది. దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెప్తున్నాయి.ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్ధనలు ఇంట్లో చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసింది.కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో ముస్లిం సోదరులంతా సహకరించాలని కూడా అలీం బాషా విజ్ఞప్తి చేశారు.