English | Telugu

డాక్టర్‌ సుధాకర్‌ కేసు.. సీబీఐకి ఏపీ హైకోర్ట్ షాక్!

విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ కేసుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నివేదికను సమర్పించింది. అయితే, సీబీఐ దాఖలు చేసిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరింత లోతైన విచారణ జరపాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ మొదటివారానికి వాయిదా వేసింది.