English | Telugu

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్ళు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 9వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మొత్తం 60వేల మంది ఉండగా, వారిలో 30 నుండి 40శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా విద్యార్థులకు 5వేల నుండి 6వేల రూపాయల విలువ గల స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించినట్టు సమాచారం.