English | Telugu
అస్సలు భయపడొద్దు.. కరోనా కూడా జ్వరం లాంటిదే: సీఎం జగన్
Updated : Apr 1, 2020
కరోనా వస్తే ఏదో పెద్ద జబ్బు వచ్చిందని బాధ పడొద్దని, పద్నాలుగు రోజుల్లో తగ్గిపోతుందని తెలిపారు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా కరోనా సోకితే, వారితో ఆప్యాయంగా ఉంటూ ధైర్యం చెప్పాలని అన్నారు. అంతేకాదు, అసలు కరోనా వచ్చినా.. 80 శాతం మందికి ఇంట్లోనే నయమైపోతుందని.. కేవలం 4 శాతం మందిని మాత్రమే ఐసోలేషన్ లో పెడతారని చెప్పుకొచ్చారు. కాబట్టి కరోనా గురించి అసలు హైరానా పడాల్సిన అవసరం లేదని, కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సీఎం చెప్పారు.