English | Telugu
ఫ్రీస్కూల్స్ గా అంగన్ వాడీ కేంద్రాలు
Updated : Jul 20, 2020
రాష్ట్రంలో 149 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల ద్వారా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో 31,711 మెయిన్ సెంటర్స్ కాగా 3898 మినీ సెంటర్స్ ఉన్నాయి.మొదటిదశలో మెయిన్ సెంటర్స్ లో ఎంపిక చేసిన కొన్ని సెంటర్లను ఫ్రీస్కూల్స్ గా మార్చనున్నారు. వీటిని తొమ్మిది గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ విధానం ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది.