English | Telugu
అండమాన్ ఆదిమవాసులను వదలని కరోనా..
Updated : Aug 28, 2020
ఈ కరోనా బాధితులంతా స్ట్రెయిట్ దీవి వాసులే. ఈ తెగలోని కొందరు రాజధాని పోర్ట్ బ్లెయిర్ వెళ్లడంతో అక్కడి అధికారులు వారికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో ఆరుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారు నివాసం ఉంటున్న స్ట్రెయిట్ దీవికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించగా మరో నలుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. అయితే మొత్తం కలిపి 50 మంది జనాభా ఉన్న ఆ దీవిలో ఏకంగా పది మందికి కరోనా సోకడంతో అక్కడి వారిలో ఆందోళన నెలకొంది.