English | Telugu
మహమ్మారితో కలిసి ఉగ్రవాదులొస్తున్నారు జాగ్రత్త.. హెచ్చరించిన ఐరాస
Updated : Nov 20, 2020
ప్రపంచంలోని కొన్ని విచ్ఛిన్నకర ఉగ్ర శక్తులు కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని, ముఖ్యంగా ఐసిస్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సరికొత్త కుట్రకు తెర తీస్తున్నాయని యూఎన్ఐసీఆర్ఐ హెచ్చరించింది. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు తమకు కరోనా సోకేలా చేసుకుని తరువాత వైరస్ బాంబుల్లా తయారవుతున్నారని పేర్కొంది. ఆపై వారు మాస్క్ లు ధరించకుండా జనసమూహాల్లోకి వెళ్లి బహిరంగంగా తుమ్మడం, దగ్గడం వంటి చర్యలకు పాల్పడతారని, దీని ద్వారా ప్రజల్లో ఈ మృత్యుకారక వైరస్ మరింత వ్యాపించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించింది. ఈ రకమైన కొత్త కొత్త దాడులను ఉగ్రసంస్థలు కూడా ప్రోత్సహిస్తున్నాయని యూఎన్ఐసీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ విధమైన కుట్ర సిద్ధాంతాల ప్రచారం కోసం సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారని తన నివేదికలో తెలిపింది.