English | Telugu

అనంతపురంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన

అనంతపురం జిల్లాలోని మూడు రిజర్వాయర్లకు ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్ల అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి భూమిపూజ చేశారు. వెంకటంపల్లి వద్ద ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, అప్పల రాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి, పనులు మాత్రం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీని కూడా పెంచామన్నారు. ఈ పనుల వల్ల రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లు.. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించనున్నట్లు తెలిపారు. దాంతో 7 మండలాలకు మేలు జరుగుతోందన్నారు. రిజర్వాయర్లు, ప్రధాన కాల్వల కోసం రూ. 800 కోట్లు విడుదల చేశామని సీఎం చెప్పారు.