English | Telugu
ఆలయ అర్చకులపై చెర్నాకోలతో వైసీపీ నేతల దాడి
Updated : Dec 1, 2020
అర్చకులను చెర్నాకోల, కర్రలతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ విచక్షణా రహితంగా ఏకంగా ఆలయంలోనే దాడి చేశారు. దీంతో సుధాకరశర్మ ముఖంపైన, మృగఫణి శర్మ వీపుపైనా గాయాలయ్యాయి. అర్చకుల ఫిర్యాదు మేరకు చైర్మన్ ప్రతాపరెడ్డి, ఆలయ సిబ్బంది ఈశ్వరయ్య, నాగరాజులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉండగా అర్చకుల పై దాడి చేసిన ప్రతాపరెడ్డి అతని అనుచరులు పై తక్షణమే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని భక్తులు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేసారు. అర్చకులను చితకబాదిన ప్రతా్పరెడ్డిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని అర్చక సమాఖ్య ప్రతినిధులు ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు డిమాండ్ చేశారు.