English | Telugu

వారిని విచారిస్తే అసలు నిజాలు తెలుస్తాయి.. పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి

నకిలీ పత్రాలతో వాహనాలు కొని నడుపుతున్నారని ఆరోపణల పై అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి అయన కుమారుడు అస్మిత్ రెడ్డి ని మొన్నశుక్రవారం కోర్టు ఆదేశాలతో రెండు రోజులకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ సందర్బంగా జరిగిన విచారణలో.. ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో ఆ వివరాలను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు తెలిపినట్లుగా అయన తరఫు లాయర్ రవికుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్ళీ కడప జైలుకు తరలించారు. హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్టుగా రవికుమార్ రెడ్డి చెప్పారు. విచారణ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తగిన ఆధారాలతో జేసీ ప్రభాకరరెడ్డి సమాధానమిచ్చారని అయన తెలిపారు.