English | Telugu
2021 అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుంది
Updated : Dec 6, 2020
కరోనా మహమ్మారి, ప్రపంచంపై దాని ప్రభావాల గురించి చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డేవిడ్ బీస్లీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూఎఫ్పీ ప్రకారం ప్రపంచంలోని 27 కోట్ల మంది ఆకలి వైపు పయనిస్తున్నారని, రానున్న ఏడాది తీవ్రమైన కరువు ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి విజృంభణ వల్ల తలెత్తిన సంక్షోభం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది అన్నారు. ఈ ఏడాది కరోనా నివారణకు 19 ట్రిలియన్ డాలర్ల వరకూ ఖర్చయిందని పేర్కొన్నారు. అయితే దీని ఫలితం వచ్చే ఏడాది దక్కే అవకాశాలు లేవని అన్నారు. ప్రపంచ వ్యవస్థ మరో మెట్టు దిగజారనుందని బీస్లీ హెచ్చరించారు.