English | Telugu
శ్రీవారి దర్శనం ప్రారంభమైంది
Updated : Jun 8, 2020
ఈ ఉదయం 9 గంటలకు దర్శనాలను ప్రారంభించగా, స్వామివారి సేవలో తరిస్తున్న టీటీడీ ఉద్యోగులు స్వామిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. మాస్క్ లను ధరించిన ఉద్యోగులు.. భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైన్లలో ఆలయంలోకి వెళ్లారు. కాగా, సుదీర్ఘ విరామం అనంతరం, దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ.. శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలకరించారు.