English | Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. కాళ్లు, చేతులు నరుకుతా

పటాన్‌ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ మీడియా ప్రతినిధితో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. భూ కబ్జాలపై ఓ కథనాన్ని రాసిన సదరు రిపోర్టర్‌ కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. నీవు ఎవ్వడివిరా? అంటూ బూతు పురాణం అందుకోవడమే కాదు.. వస్తావా? లేదా ఎక్కడున్నావో చెప్పు.. నేనే వస్తా.. కాళ్లు, చేతులు నరుకుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. కావాలంటే నేను మాట్లాడేది రికార్డు చేసుకో.. దిక్కు ఉన్న చోట చెప్పుకో.. పోలీసులకు ఫిర్యాదు చేసుకో.. అంటూ బూతులు తిట్టారు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయింది. జర్నలిస్టు పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి.