English | Telugu

స‌మీర్ వాంఖ‌డే హిందూ కాదు ముస్లిం.. ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన‌ ఎన్సీపీ..

స‌మీర్ వాంఖ‌డే. డ్ర‌గ్స్ కేసులో షారుఖ్‌ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచీ.. దేశ‌వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఆర్య‌న్‌ఖాన్ కేసు నుంచి త‌ప్పించినా.. ఎన్సీపీతో, మంత్రి మాలిక్‌తో వివాదం మాత్రం కంటిన్యూ అవుతోంది. తాజాగా, స‌మీర్ వాంఖ‌డే హిందువు కాదు ముస్లిం అంటూ ఆధారాలు సైతం చూపించారు.

సమీర్ వాంఖడే అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని, అతను ముస్లిం అని రుజువు చేసే పాఠశాల సర్టిఫికెట్లు బ‌య‌ట‌పెట్టారు. సమీర్ వాంఖడేకు చెందిన రెండు పాఠశాల సర్టిఫికేట్‌లను రిలీజ్ చేశారు. స్కూలు సర్టిఫికెట్లలో సమీర్ పేరు మధ్య ‘దావూద్’ అని ఉంది. వడాలలోని సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్, దాదర్ లోని సెయింట్ పాల్ హై స్కూల్ సర్టిఫికెట్లలో సమీర్ ‘దావూద్’ వాంఖడే అని ఉంది. ఆ స‌ర్టిఫికెట్స్‌లోని రిలీజియ‌న్‌ కాలమ్ లో ‘ముస్లిం’ అని ఉంది.

ఇక‌, 1995 నాటి స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌లో అతని పేరు వాంఖడే సమీర్ ద్యాందేవ్ అని, కులం ‘మహర్’ అని ఉంది. వాంఖడే ముస్లింగా జన్మించాడని యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎస్సీ కోటా కింద ఉద్యోగం పొందేందుకు అతను హిందూ ఎస్సీ వర్గానికి చెందినవాడినని కుల ధృవీకరణ పత్రంతో సహా నకిలీ పత్రాలను రూపొందించారని మంత్రి నవాబ్ మాలిక్ గతంలో ఆరోపించారు. నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడే జనన ధృవీకరణ పత్రం కాపీని కూడా విడుదల చేశారు.

‘‘స‌మీర్‌ కంప్యూటరైజ్డ్ సర్టిఫికెట్లను ఉపయోగిస్తున్నాడు. అవన్నీ బోగస్. మేం నిజమైన సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించాం, అవన్నీ డాక్యుమెంట్ చేశారు. అతను ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడం ఖాయం’’అని మంత్రి మాలిక్ అన్నారు.

అయితే, ఎన్సీపీ శిబిరం రిలీజ్ చేసిన త‌న స్కూల్ స‌ర్టిఫికెట్ల‌పై స‌మీర్ వాంఖ‌డే స్పందించారు. అస‌లేం జ‌రిగిందో.. త‌న పుట్టుపూర్వోత్త‌రాలు వివరించారు. ‘‘మా నాన్న‌ జ్ఞాన్‌దేవ్ కచ్రూజీ వాంఖడే హిందువు. నా తల్లి దివంగత జహీదా ముస్లిం. నేను నిజమైన భారతీయ సంప్రదాయంలో లౌకిక కుటుంబానికి చెందినవాడిని. నా వారసత్వం గురించి నేను గర్వపడుతున్నాను. నేను డాక్టర్ షబానా ఖురేషీని 2006లో ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం పౌర వివాహ వేడుకలో వివాహం చేసుకున్నాను. మేమిద్దరం 2016లో సివిల్ కోర్టు ద్వారా పరస్పరం విడాకులు తీసుకున్నాం. తర్వాత 2017లో నేను క్రాంతి దీనానాథ్ రెడ్కర్‌ను వివాహం చేసుకున్నాను’’ అని సమీర్ వాంఖడే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇలా స‌మీర్‌ వాంఖ‌డే మ‌తంపై ఎన్సీపీ లేవ‌నెత్తిన‌ వివాదం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతోంది.

మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.