English | Telugu

నిర్మలమ్మ పద్దు... వీటి ధరలు తగ్గుతాయ్!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధానంగా పేదలు, మహిళలు, యువత, రైతులకు ప్రయోజనం కలిగే అంశాలపై దృష్టి పెట్టారు. బడ్జెట్ సందర్భంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని తగ్గుతాయి

ధరలు తగ్గేవి:

క్యాన్సర్ మందులు

ప్రాణాలను రక్షించే మందులు

ఫ్రోజెన్ చేపలు

చేపల పేస్ట్

ఖనిజాలు

ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు

స్వదేశంలో తయారైన దుస్తులు

మొబైల్ ఫోన్లు

లెదర్ గూడ్స్

మెడికల్ ఎక్విప్ మెంట్

మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.