English | Telugu
ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ మరో సారి రద్దు.. ఇక మళ్ళీ కోర్టుకేనా..
Updated : Nov 19, 2020
ఇది ఇలా ఉండగా వీడియో కాన్ఫరెన్స్ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ రాకపోవడంతో పాటు ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే విషయాన్ని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ కోసం రెండు సార్లు సీఎస్ కు లేఖలు రాసినా అంగీకరించ లేదనే విషయాన్ని సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా.. ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ఎస్ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది ఇలా ఉండగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అసభ్య వ్యాఖ్యలతో పాటు, ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి నాని ఉపయీగించిన పదజాలం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో టేపులు, పేపర్ క్లిప్పింగులను ఎస్ఈసీ గవర్నర్ కు పంపారు. మంత్రి నాని పై వెంటనే చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ గవర్నర్ కు విజ్ఞప్తి చేసారు.