English | Telugu
సీఎం జగన్ పై పోటీ చేసి గెలుస్తా.. మీకు దమ్ముందా.. రఘురామరాజు సంచలన కామెంట్స్
Updated : Oct 17, 2020
ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్గా ఉన్న రఘురాజును తప్పించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం పై తాజాగా స్పందించిన అయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ.. తనను ఎవరూ తొలగించలేదని.. తొలగించలేరు కూడా అంటూ వ్యాఖ్యానించారు. దీని పై మరింత వివరణ ఇస్తూ.. "మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి నన్ను తొలగించాలని వైసీపీ ఎంపీలు స్పీకర్కు లేఖ ఇచ్చారు. అది ఒక ఏడాది పదవి అని.. అయితే మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారు. తాజాగా నా పదవి కాలం అయిపోయింది కాబట్టి.. దానిని మా పార్టీకే చెందిన బాలశౌరికి ఇవ్వాలని వైసిపి లెటర్ ఇచ్చింది. ఇప్పటివరకు రెడ్డి సామజిక వర్గానికి పదవులు ఇవ్వడం అయిపోయింది దీంతో. ఆయన మతానికి చెందిన వారికి ఆ పదవి ఇచ్చారు. బాలశౌరికి ఆ పదవి ముష్టి వేసారు. ఈ విషయం తెలియని వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటోంది" అని ఎంపీ రఘురాజు అన్నారు.