English | Telugu
ఎవరు ఎవరి సంక నాకుతున్నారో చూస్తూనే ఉన్నాం.. రఘురామ రాజు ఫైర్
Updated : Oct 7, 2020
"ఇప్పటికే తమకు ఎవరితోనూ జట్టుకట్టే ఉద్దేశం లేదని బీజేపీ స్పష్టంగా చెప్పింది .. కానీ వైసీపీ మాత్రం సొంత ప్రచారం చేసుకుంటోంది. వీళ్లను కేబినెట్లోకి రావాలని బతిమాలుతున్నట్టు... అయితే వీళ్ళు మాత్రం ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారు. ప్రత్యేక హోదాపై జగన్కు అంత ప్రేమ ఉందా? ప్రత్యేక హోదా కావాలంటే కేబినెట్ నుంచి బయటకు రావాలని... అప్పట్లో టీడీపీని డిమాండ్ చేశారు కదా? హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి. వైసిపి ఎంపీలు కనుక ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే... నేను కూడా వైసీపీకి సహకరించేందుకు సిద్ధం’’ అని అయన అన్నారు.
అయినా దేవాలయాలు నిర్మించే పార్టీ అయిన బీజేపీ... ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా? అని అయన ఈ సందర్బంగా ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్... ఇప్పుడు బీజేపీతో కలవాలనుకుంటున్నారా? అని అయన నిలదీశారు. సీఎం జగన్ చెబుతున్నట్టు 20 ఏళ్లు అధికారంలో ఉండాలంటే... అయన నిర్మాణాత్మకంగా వ్యవహరించడం నేర్చుకోవాలని రఘురామరాజు అన్నారు.