English | Telugu
అచ్చెన్న పరామర్శకు వచ్చిన బాబు.. అనుమతించని అధికారులు
Updated : Jun 13, 2020
అక్కడే ఉన్న విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం అభివృద్ధి కోసం అచ్చెన్న కుటుంబం కృషి చేసిందని.. ప్రస్తుత ప్రభుత్వ పాలన నవరత్నాలు.. నవ మోసాలుగా ఉన్నాయని పోరాడుతుంటే అచ్చెన్నాయుడి పై లేని పోని కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. అచ్చెన్నను ఇరికించడం కోసం తప్పుడు రికార్డులను సృష్టించారని.. ప్రతిష్ట కలిగిన అయన కుటుంబంపై వైసిపి నాయకులు బురద జల్లుతున్నారన్నారు. పలువురు టీడీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకుంటున్నారని అయన విమర్శించారు. వాస్తవాలు ప్రజల ముందు పెడతాం.. దోషులు ఎవరో త్వరలో తెలుస్తుంది. వైసీపీ నేతలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. దేశంలో ఉన్న చట్టాన్ని ఏపీలో అమలు చేయడంలేదని బాబు మండిపడ్డారు.