English | Telugu
ట్వీట్ చేసింది, అరెస్ట్ అయ్యింది... గాంధీని విమర్శించిన బాలీవుడ్ నటి అరెస్ట్
Updated : Dec 17, 2019
గుజరాత్ లో బాలీవుడ్ నటిని అదుపులోకి తీసుకున్నారు రాజస్థాన్ పోలీసులు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ ఇష్టమొచ్చింది మాట్లాడితే చిక్కుల్లో పడటం తప్పదని అంటున్నారు పోలీసులు. కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులతో అడ్డంగా బుక్కవుతున్నారు. ఇప్పుడు అన్ని రాష్ర్టాల పోలీసులు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక ఐటీ యాక్ట్ తీసుకొచ్చారు. హద్దులు మీరిన కామెంట్లు పోస్ట్ లు కనిపిస్తే చాలు అరెస్ట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. పాయల్ రోహత్గి అనే బాలీవుడ్ నటి.. చేసిన ట్వీట్ ఆమెను చెరసాల దాకా తీసుకెళ్లింది. ఇటీవల నెహ్రూ , గాంధీలను ఉద్దేశించి పోస్ట్ చేసిన వీడియో ప్రకంపనలు రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నెహ్రూ, గాంధీ ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదవడంతో ఆమెను అరెస్టు చేశారు. గుజరాత్ నుంచి రాజస్థాన్ తీసుకువెళ్ళి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం ఎనిమిది రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. ఇప్పుడు పాయల్ రోహత్గి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. నటిగా చెప్పుకుంటున్న ఆమె ఏకంగా రాజకీయ నాయకులపై అసభ్యకర పోస్టు పెట్టడంతో ఆమె కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాయల్ అరెస్టయినప్పటికీ ఆమె లాయర్ మాత్రం అరెస్టును తప్పుపడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాయడమే అంటున్నారు. ఒక పాయల్ విషయం లోనే కాదు గతంలో బెంగాల్లోనూ మమత సర్కార్ ఇలాగే వ్యవహరించింది. మమతా బెనర్జీ మీద అభ్యంతరకర మీమ్ ను పోస్ట్ చేశారంటూ బీజేపీ కార్యకర్త ప్రశాంత్ కనోజియాను జైలుకు పంపించారు. దీనిపై కేంద్రమే కదిలివచ్చింది అప్పుడు. సుమారు నెల రోజుల పాటు జైలులో ఉన్నారు ప్రశాంత్ కనోజియా.