English | Telugu

ఆవో దియా జెలాయే : ప్రధాని ట్వీట్‌

క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలగించాలని ప్రధాని మోదీ శుక్రవారం వీడియో సందేశం ఇచ్చారు.

అయితే శ‌నివారంనాడు ప్ర‌ధాన‌మంత్రి తన ట్విట్టర్‌లో మరో పోస్టును పెట్టారు. ఆవో దియా జలాయే అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వినిపించిన ఓ కవితను ఆ ట్వీట్‌లో పోస్టు చేశారు. ఆవో ఫిర్‌సే దియా జెలాయే అంటూ అటల్ ఆ కవిత వినిపిస్తారు.

క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి సంఘీభావంగా అన్ని లైట్లను పూర్తిగా ఆర్పివేసి.. దీపాలను, కొవ్వొత్తులను వెలగించాలని ప్రధాని పిలుపు ఇచ్చారు.