English | Telugu
డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ వాక్సిన్.. కానీ భారత్ లో మాత్రం ఆలస్యం .. కారణం అదే..!
Updated : Oct 29, 2020
తాము 10కోట్ల వాక్సిన్ డోసులను సిద్ధం చేస్తున్నామని… వ్యాక్సిన్ సేఫ్ అని ఫైనల్ ట్రయల్స్ లో తేలితే ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సినేషన్ కు వెంటనే అవకాశం ఇవ్వాలని తాము భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని అయన వెల్లడించారు. అయితే ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ నిర్ణయమే కీలకమని అయన వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక అత్యవసరం అని భావించి అనుమతిస్తే మాత్రం జనవరి నాటికి సామాన్య ప్రజలకు కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయి. లేదంటే మాత్రం ఆలస్యం అవుతుందని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ సేఫ్ అనే తేలటంతో… బ్రిటన్ లో అత్యవసరంగా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.