English | Telugu
ప్రభుత్వాన్ని విమర్శించిన మరుసటి రోజే జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ పై కేసు..
Updated : Oct 10, 2020
అయితే చాలాకాలం తరువాత నిన్న జేసీ దివాకర్ రెడ్డి గనుల కార్యాలయానికి చేరుకుని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని పరోక్షంగా సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొద్దిరోజుల క్రితం వరకు తన సోదరుడిని టార్గెట్ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు తనను టార్గెట్ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జేసీ దివాకర్ రెడ్డి అటు ప్రభుత్వం ఇటు అధికారులపై విమర్శలు చేసిన మరుసటి రోజే... ఆయనకు నోటీసులు జారీ కావడం గమనార్హం.