English | Telugu
సీఎం జగన్ మేనమామకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు
Updated : Jun 25, 2020
కాగా, కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో కొత్తగా సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతంలో స్ధల పరిశీలన కోసం అధికారులు వెళ్లారు. వారితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కూడా వెళ్లారు. అయితే, వారు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో సాగు భూములు ఎక్కువ ఉన్నందున సోలార్ ప్లాంట్ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.