English | Telugu
ఓటిటి ప్లాట్ ఫార్మ్, ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ పై కేంద్రం కంట్రోల్
Updated : Nov 11, 2020
అయితే ఇప్పటివరకూ డిజిటల్ కంటెంట్ను పర్యవేక్షించేందుకు భారత్లో ఎలాంటి వ్యవస్థ లేని సంగతి తెల్సిందే. దీంతో వాస్తవాలతో పాటు గాలి వార్తలు (ఫేక్న్యూస్) కూడా డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అంతేకాకుండా సినిమాల పేరుతో అసభ్యకర చిత్రాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే డిజిటల్ కంటెంట్పై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని భావించిన కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ మీడియాను న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోషియేషన్, సినిమాలను సెన్సార్ బోర్డు పర్యవేక్షిస్తున్నాయి. తాజా నిర్ణయంతో.. డిజిటల్ కంటెంట్ను కేంద్రమే స్వయంగా పర్యవేక్షించనుంది.