English | Telugu
ఫేస్బుక్ చీఫ్ జుకర్బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ లేఖ
Updated : Aug 18, 2020
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫేస్బుక్ ఓనర్ జుకర్బర్గ్ కు లేఖ రాశారు. హింసను ప్రేరేపించే కంటెంట్ను అనుమతించేందుకు ఫేస్బుక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంఖి దాస్ బీజేపీకి పావులా మారారని లేఖలో కాంగ్రెస్ ఆరోపించింది. భారత్ లో 40 కోట్ల మంది ఫేస్బుక్, వాట్సాప్ వినియోగాదారులు ఉన్నారని, వారందని నమ్మకాన్ని తిరిగి పొందాంటే నిష్పాక్షిక విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కేసీ వేణుగోపాల్ రాసిన లేఖను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్నో పోరాటాలతో తాము సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమతించబోమని, దీనిపై భారతీయులందరూ ప్రశ్నించాలని రాహుల్ పేర్కొన్నారు.