English | Telugu
ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000 కోట్లు ఖర్చు చేశాం
Updated : Jun 26, 2020
టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఈ ఏడాది కాలంలో అందులో మూడో వంతు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు నీరందించాలన్న సంకల్పంతో టీడీపీ ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి 2వ దశ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిందని అన్నారు. హంద్రీ-నీవా 2వ దశ పనులను 90 శాతం వరకు పూర్తి చేసి శ్రీశైలం నీటిని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం వరకు ప్రయోగాత్మకంగా విడుదల చేస్తే... ఆ ప్రాంతానికి నీళ్ళు రావడం చూసి ప్రజలు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. అలాంటిది మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేయకుండా పక్కనపెట్టిందని విమర్శించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో రైతులు నష్టపోయారు. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ నీటిపారుదల పనులు పూర్తిచేసి ప్రభుత్వం రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.