English | Telugu
ఏపీ రాజధాని అంశంతో మాకు సంబంధం లేదు: కేంద్రం
Updated : Aug 6, 2020
విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014లో శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని నియమించామని కేంద్రం తెలిపింది. 2015 ఏప్రిల్ 23న అప్పటి ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని, రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి జూలై 31న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది.