English | Telugu
మళ్ళీ అదే మాట.. రాజధానుల అంశంలో జోక్యం చేసుకోలేము
Updated : Sep 10, 2020
మూడు రాజధానుల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ తెలిపింది. మూడు రాజధానులను అడ్డుకోగలిగే అధికారం కేంద్రానికి ఉందనేది పిటిషనర్ దోనె సాంబశివరావు అపోహ మాత్రమేనని వెల్లడించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే తాము చెప్పిమని పేర్కొంది. అమరావతే ఏపీ రాజధాని అని కూడా తాము ఎక్కడా చెప్పలేదని, రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ అంతిమ నిర్ణయమని స్పష్టం చేసింది.