English | Telugu
ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు షాక్.. ఆగస్టు 5న ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ!
Updated : Jul 30, 2020
మరోవైపు.. కృష్ణా, గోదావరి జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఆగస్టు 5న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రెండు రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాశారు. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశామని, ఆ రోజున ఇద్దరు సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్న సమాచారాన్ని తెలపాలని లేఖలో కోరారు.