English | Telugu

రాజధాని ప్రాంతం లో ఇతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు స్టే

రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై హైకోర్టు స్టే ఇచ్చింది.రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించటం సరికాదని రైతులు హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాది. అయితే ఇక్కడ స్థలాలను దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రధాని మంత్రి ఆవస్ యోజన లో కూడా ఇళ్ల నిర్మాణం జరిగిందని, దుగ్గిరాల, మంగళగిరి సీఆర్డఏ పరిధిలోనే వస్తాయని కోర్టు కి తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది. దీనిపై తీర్పును లోగడ రిజర్వ్ చేసిన హైకోర్టు, నేడు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.