English | Telugu

ఆకాశరామన్న ఉత్తరం పై అమరావతి మహిళల ఆగ్రహం

ఏపీలో రాజధాని విషయం పై రచ్చ జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళన 248వ రోజుకు చేరింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని విషయంలో మాకు సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్ ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ సందర్భంగా అమరావతి మహిళలు మాట్లాడుతూ "రాజధాని రాష్ట్రానికి సంబంధించిన విషయం మాకు సంబంధం లేదంటున్నప్పుడు ఏ అధికారంతో రాష్ట్రాన్ని విడదీశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ప్రకటించండి" అంటూ కేంద్రం పై మండి పదారు.

ఒకటే రాష్ట్రం దానికి ఒకటే రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ వారు ఆందోళన చేస్తున్నారు. అయితే తాజాగా "మీకు ఈ పరిస్థితి రావటానికి కారణం చంద్రబాబు" అంటూ మందడంలోని దీక్ష శిబిరానికి నిన్న గురువారం ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. దీనిపై అక్కడ దీక్ష చేస్తున్న రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.