English | Telugu

రాజధానిలో స్పీకర్ తమ్మినేనికి ఘోర అవమానం!!

దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఘోర అవమానం జరిగింది. ఏపీ భవన్‌ సిబ్బంది వల్ల ఎదురైన అవమానంతో తమ్మినేని మనస్తాపం చెందారని తెలుస్తోంది. ఓ పర్యటన నిమిత్తం సతీసమేతంగా డెహ్రాడూన్ వెళ్లిన తమ్మినేని.. తిరిగి ఢిల్లీ చేరుకొని ఏపీ భవన్‌లో బస చేశారు. అయితే అక్కడి నుంచి తిరిగి ఏపీకి బయల్దేరే సమయంలో.. ఏపీ భవన్ ఉద్యోగి ఒకరు భోజనం, వసతికి సంబంధించి బిల్లు కట్టాలని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో తమ్మినేని షాక్ అయ్యారట. గెస్ట్ హోదాలో వచ్చిన తనను బిల్లు కట్టమని అడగటంతో తమ్మినేని అసంతృప్తి వ్యక్తం చేశారట. అసలు విషయం ఏంటని అక్కడి సిబ్బందిని ఆరా తీస్తే.. అమరావతిలో ఉండే జీఏడీ నుంచి స్టేట్‌ గెస్ట్‌గా కాకుండా కేటగిరీ-1లో వసతి కల్పించాలని ఆదేశాలిచ్చారని చెప్పుకొచ్చారట. దీంతో తమ్మినేని.. ముందు బిల్లు కట్టేయండని తన సిబ్బందిని ఆదేశించారట. ఈ వ్యవహారంపై ఆయన సతీమణి కూడా కాస్త అసహనానికి గురయ్యారట. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారట. ఇంత జరిగిన తర్వాత అధికారులు ఎప్పటికో తప్పును గ్రహించారట. స్టేట్ గెస్ట్‌గా వచ్చినవారి నుంచి బిల్లలు వసూలు చేయడం తప్పేనని క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.