English | Telugu
ఆ జడ్జి మాకొద్దు.. హైకోర్టులో జగన్ సర్కార్ వాదన
Updated : Dec 16, 2020
ఈ కేసు ను పూర్తిగా విచారించకుండానే... రాష్ట్రంలో రాజ్యంగ వ్యవస్థలు విచ్చిన్నమయ్యాయని జస్టిస్ రాకేష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేక కామెంట్ చేశారని… ఆయనే ఈ కేసును విచారిస్తే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని ప్రభుత్వం ఆ అఫిడవిట్ లో వాదించింది. ఇప్పటికే ఆక్రమణలలో.. వివాదాల్లో చిక్కుకున్న ఆస్తులను విక్రయించాలని తాము భావించామని అయితే ఈ కేసు పై విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సిన న్యాయమూర్తి ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం… గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పేర్కొంది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తిపై నమ్మకం లేకుంటే విచారణ నుండి తప్పించమని కోరే అధికారం పిటిషనర్ కు ఉందని చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ కేసుపై రేపు గురువారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది.