English | Telugu
80 శాతం మంది కరోనా బాధితులకు ఆ లోపం వల్ల ముప్పు ఎక్కువ.. తాజా పరిశోధనలో వెల్లడి
Updated : Oct 30, 2020
అయితే తాజాగా జరిగిన ఒక పరిశోధనలో కరోనా బారిన పడుతున్న వారిలో 80 శాతం మందికి "డి విటమిన్" లోపం ఉందని స్పెయిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా 216 మందిని పరిశీలించగా వారిలో 80 శాతం మంది రక్తంలో డి విటమిన్ తగినంత స్థాయిలో లేదని తేలిందని ఆ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరీ ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషులలోనే డి విటమిన్ తక్కువగా ఉన్నట్లు కూడా వారు నిర్ధారించారు. ఈ అధ్యయనం ప్రకారం తగినంత డి విటమిన్ లేకపోవడం వల్ల కరోనా రోగుల పరిస్థితి విషమించి చనిపోయే ప్రమాదం 51.5 శాతం ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెపుతున్నారు. అంతేకాకుండా "డి విటమిన్" లోపం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డి విటమిన్ తక్కువగా ఉన్నవారిలో డయాబెటీస్, రక్తపోటు, ఒబేసిటీ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.