Read more!

English | Telugu

మొదటి భాగం కంటే.. 681 శాతం ఎక్కువ బడ్జెట్‌తో రెండో భాగం!

ప్రస్తుతం రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన కథలతో సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడదే ట్రెండ్‌గా మారిపోయింది. అందుకే దర్శకులు కూడా 30 సంవత్సరాల క్రితం కథ అంటూ స్టార్ట్‌ చేస్తున్నారు. కథ ఏ సంవత్సరంలోనిది అని చెప్పినా అందులో విషయం ఉంటే తప్పకుండా హిట్‌ అవుతుంది. ఇటీవల చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ‘కాంతార’ విషయంలో కూడా అదే జరిగింది. కన్నడలో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. కన్నడలో విడుదలై విజయం సాధించిన తర్వాతే తెలుగులో రిలీజ్‌ అయింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా కాన్సెప్ట్‌, దాన్ని రిషబ్‌ శెట్టి అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం వల్ల సినిమా ఘనవిజయం సాధించింది. 

అనూహ్య విజయం సాధించిన ఈ సినిమాకి ప్రీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు, హీరో  రిషబ్‌శెట్టి ప్రకటించారు. కాంతార ప్రీక్వెల్‌ డిసెంబర్‌లో స్టార్ట్‌ అవుతుందని తెలుస్తోంది. ప్రజల భూమిని రక్షించే స్థానిక దేవత.. కథానాయకుడి ఆత్మతో ఎలా మమేకం అయ్యింది? అనేది పార్ట్‌ 1లో చూపించారు. ఈ ప్రీక్వెల్‌ క్రీ.శ. 301-400 మధ్య జరిగిన కథగా ఉంటుంది. కాంతారలో చూపించిన పంజుర్లీ దైవం మూలాలకు సంబంధించిన కథతో ప్రీక్వెల్‌ తెరకెక్కనుంది. కాంతార 1కి పనిచేసిన ప్రధాన టెక్నీషియన్స్‌ ప్రీక్వెల్‌కి కూడా ఉంటారు. కాంతార కంటే 681 శాతం ఎక్కువ బడ్జెట్‌తో ఈ ప్రీక్వెల్‌ నిర్మిస్తారట. కాంతారావు 2 చిత్రీకరణను 2024లోనే పూర్తి చేసి, వచ్చే ఏడాది చివరిలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.