Read more!

English | Telugu

ఈ ముగ్గురికి రెండవ ఛాన్స్

 

ఎన్టీఆర్ ప్రస్తుతం "రభస" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

"ఆంధ్రావాలా" చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్ర వివరాలు ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20)న తెలియజేయనున్నారు. ఇప్పటికే గణేష్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో "బాద్ షా" చిత్రం వచ్చింది. ప్రస్తుతం ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

"ఆంధ్రావాలా" తర్వాత పూరి ఎన్టీఆర్ లకు ఇది రెండవ చిత్రం... "బాద్ షా" తర్వాత ఎన్టీఆర్ గణేష్ లకు ఇది రెండవ చిత్రం... "ఇద్దరమ్మాయిలతో" చిత్రం తర్వాత పూరి గణేష్ కు ఇది రెండవ చిత్రం.. మరి ఈ ముగ్గురికి రెండవ ఛాన్స్ ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.