Read more!

English | Telugu

మొదటి బోణి ఆవిడేనా...?

 

హిందీలో సూపర్ హిట్టయిన "కౌన్ బనేగా కరోడ్ పతి" కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమానికి "మీలో కోటీశ్వరులు ఎవరు" అనే టైటిల్ ఖరారు చేసారు. మా టీవీ సమర్పిస్తున్న ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ కార్యక్రమాన్ని ముందుగా తన భార్య అమలతో ప్రారంభించాలని, అమలను కోటీశ్వరాలినిగా చూడాలనే నాగార్జున ఆమెకు తొలి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. మాటీవిలో తనకు షేర్స్ ఉన్నప్పటికీ కూడా రెమ్యునరేషన్ విషయంలో నాగార్జున ఎలాంటి రాజీపడలేదట. నలభై ఎపిసోడ్స్ లు కొనసాగే ఈ కార్యక్రమం కోసం దాదాపు మూడు కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ కార్యక్రమం తెలుగులో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో త్వరలోనే తెలియనుంది.