Read more!

English | Telugu

అమితాబ్ భార్య కాలర్ పట్టేసుకుందట !

 

 

గతకొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఎక్కువగా హాస్పిటల్స్ కి వెళ్తున్నాడని, ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని పుకార్లు, వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై బచ్చన్ కుటుంబం ఏ విధంగా కూడా స్పందించలేదు. దాంతో ఈ వార్తలకు స్వస్తి పలికించాలని భావించిన ఓ రిపోర్టర్ నేరుగా వెళ్లి అమితాబ్ భార్య జయా బచ్చన్ ను అమితాబ్ క్యాన్సర్ గురించి అడిగేశాడట.

అసలు ఇదంతా ఎలా జరిగిందంటే.... ఇటీవలే జయాబచ్చన్ ఓ పబ్లిక్ ఈవెంట్‌కి హాజరైంది. అయితే అమితాబ్ గురించి జయను అడిగితెలుసుకోవాలని భావించిన ఆ రిపోర్టర్ ఇంకేమి ఆలోచించకుండా నేరుగా ఆమె వద్దకెళ్ళి ''అమితాబ్‌కి క్యాన్సర్ సోకిందని, అందుకే ఆయన తరచూ హాస్పిటల్ కెళ్లి చికిత్స తీసుకుంటున్నాడని బయట రూమర్లు వస్తున్నాయి. అది నిజమేనా'' అని అడిగాడట. ఆ ప్రశ్న విన్న వెంటనే బయాబచ్చన్‌కి ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యింది. దాంతో జయా "నాతోనే... 'మీ ఆయనకు క్యాన్సర్ వచ్చిందా' అని అడుగుతావా.. హౌ డేర్ యు'' అని అంటూ ఆ రిపోర్టర్ కాలర్ పట్టుకుని గొడవ పెట్టుకుందట. దాంతో అనుకోని పరిణామంతో భయపడిపోయిన ఆ రిపోర్టర్ అక్కడినుంచి ఎలాగోలా జయా నుంచి తప్పించుకొని బయటపడ్డాడట.