Read more!

English | Telugu

మహేష్ భామతో చైతు రొమాన్స్

 

మహేష్ తో "1నేనొక్కడినే" చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం హిందీలో "హీరోపంటి" చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడికి తెలుగులో నాగచైతన్య సరసన నటించే అవకాశం వచ్చింది. "స్వామి రా రా" చిత్రంతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ గా కృతిసనన్ ను తీసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. అలాగే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో కూడా హీరోయిన్ గా కృతిని తీసుకున్నట్లు తెలిసింది. ఈ వార్తల గురించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది.